పవన్ అన్న ప్రజా బాటతో దూసుకుపోతున్న రాటాల రామయ్య

  • పవన్ అన్న ప్రజా బాట 111వ రోజు
  • 2024 ఎన్నికల్లో జనసేనదే అధికారం
  • రాజంపేట జనసేన పార్టీ రాష్ట్ర రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య

రాజంపేట నియోజకవర్గం: జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు 111వ రోజు నందలూరు మండలంలోని పలు గ్రామాలలో గుడిసిల్లు, వెంకట రాజంపేట, కొమ్మూరు, కోనాపురం, మదనమోహనపురం, ఈడిగపల్లిలలో ఇంటింటికి తిరిగి జనసేన పార్టీ రూపొందించిన కరపత్రాలను జనసేన పార్టీ సిద్ధాంతాలను ఆశయాలను జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అక్కడ ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ రానున్న 2024 ఎలక్షన్స్ లో జనసేన పార్టీని ఆదరించండి మీకు ఏదైనా సమస్య ఉంటే జనసేన పార్టీ అధికారంలోకి రాగానే తీర్చిదిద్దుతాం అని ఆ గ్రామ ప్రజలకు వివరించారు. ఆ గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని చూసి విసిగిత్తి పోయిందన్నారు. రానున్న ఎలక్షన్స్ లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కోలదోస్తామని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర్ పంతులు, పోలిశెట్టి శ్రీనివాసులు, చౌడయ్య తదితరులు పాల్గొన్నారు.