మహేష్ బృందానికి ఘన స్వాగతం పలికిన రాయచోటి జనసేన

రాయచోటి, జనసేనపార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన యువశక్తి, రాయలసీమ ప్రచార రథంతో పర్యటనలో భాగంగా విచ్చేసిన మహేష్ బృందం వారికి శుక్రవారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో జనసేన నాయకులు, జనసైనికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాయచోటి పార్టీ నేతృత్వంలో ప్రదీప్, కిరణ్, ఫటాన్, జయరామ్, వశివుల్లా, బాలాజీ, శివతో కలిసి శాలువా, పూలదండలతో జనసేన నేత ఎం.మహేష్ ను ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన “యువశక్తి” మన యువత, మన భవిత! ఈ నెల జనవరి 12వ తేదీన ఉదయం 11 గంటల నుంచి భారీ బహిరంగ సభ వేదిక రణస్థలం, శ్రీకాకుళం జిల్లా యువత సమస్యలపై గళమెత్తనున్న జనసేనాని సమక్షంలో గళమెత్తడానికి యువత భారీ ఎత్తున తరలిరావాలన్నారు. జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంలో సినిమాల మీద చూపే అభిమానం! కోట్లాది మంది అభిమానులు ఓటర్లుగా మారి ఆయన ఇచ్చే సూచనలతో స్ఫూర్తిగా తీసుకుని ఆశయ సిద్ధాంతాల ప్రకారం వాలంటీర్లుగా దృష్టి పెట్టి స్వచ్చందంగా పార్టీ అభివృద్ధి కోసం క్షేత్ర స్థాయిలో తమ అనుకూల సమయాలలో కృషి చేయాలని పిలుపునిస్తూ. రాబోయే ఎన్నికల్లో అందర్నీ కలుపుకుని అధికారం కోసం గెలుపే లక్షంగా పని చేయాలి తద్వారా ఆయన పరిపాలనలో యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి భావితరాల భవిష్యత్తుకు బలంగా పునాదులు ఏర్పడుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, స్థానిక మద్దతు దారులు, అభిమానులు పాల్గొన్నారు.