డీజీపీ పీవీ సునీల్ కుమార్ ను మర్యదపూర్వకంగా కలిసిన జనసేన జానీ

అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఫైర్ సర్వీస్ డీజీపీ పీవీ సునీల్ కుమార్ ను మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం అంబేద్కర్ఇంచార్జ్ వజ్రగడ రవికుమార్ (జనసేన జానీ) కలవడం జరిగింది. ఈ సందర్బంగా అంబేద్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర సైనిక్ విభాగ కన్వీనర్ డీజీపీ సునీల్ కుమార్ కు పరిచయం చేస్తూ వీరఘట్టం మండలంలో ఏయిమ్ సంస్థ ఆధ్వర్యంలో కిమ్మి కఒబరవలస బూరుగా గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆవిష్కరణలు చేయించడం జరిగిందని డీజీపీ గారితో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ సునీల్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఇండియా మిషన్ పటిష్టతకు కృషి చేస్తున్న రవికుమార్ (జానీ)ను డీజీపీ సునీల్ కుమార్ అభినంధించిడం జరిగింది. రవికుమార్(జానీ) మాట్లాడుతూ మీ లాంటి పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తిని కలవడం చాలా సంతోషంగా ఉంది, మిమ్మల్ని కలిపించిన శ్రీను అన్న గారికి ధన్యవాదములు అని తెలిపారు.