పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రాయపురెడ్డి

మంగళగిరి నియోజకవర్గం: మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ ను శనివారం మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి, నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి అలాగే పార్టీ అభివృద్ధి కోసం నియోజకవర్గంలో చేయవలిసిన కార్యక్రమాల కోసం చర్చిచడం జరిగింది. ఇటీవలె ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ అధ్యక్షులుగా పంచకర్ల రమేష్ బాబు గారిని నియమించడం ద్వారా నియోజకవర్గంలో ఉన్న జనసైనికులందరిలో నూతన ఉత్తేజం వచ్చిందని, అదేవిధంగా మాడుగుల నియోజకవర్గంలో అన్ని కమిటీలు వేసి నియోజకవర్గాన్ని మరింతగా ప్రోత్సహించాలని జనసేన అధినేతను కోరడం జరిగింది. ప్రారంభించిన అంబులెన్సుల సేవలు గురించి కళ్యాణ్ గారు ప్రశంసించడం జరిగింది. నియోజకవర్గంలో అందరూ కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేసుకోవాలని తెలియజేసారు. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి విజయమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు.