బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచిన రాజోలు వైస్ ఎంపీపీ

*రాజోలు, క్రియాశీలక సభ్యత్వం విలువను పెంచి కార్యకర్తల్లో నమ్మకాన్ని నింపుతున్న జనసేన పార్టీ రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు.

ప్రతి రాజకీయ పార్టీలో నాయకులు, కార్యకర్తలు ఉంటారు అయితే పార్టీ సిద్దాంతాలు, పార్టీ అధినేత ఆశయాలు ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకువెళ్లడం తద్వారా పార్టీ గ్రామ స్థాయి కార్యకర్తలలో, వారి కుటుంబాలలో కూడా మేము ఉన్నామని దైర్యాన్ని ఇవ్వడంలో కొందరు మాత్రమే ఉంటారు. ఆ కోవకు చెందిన నిబద్దత కలిగిన క్రియాశీలక కార్యకర్త మరియు ప్రజల కోసం పనిచేసే ప్రజా సేవకుడు రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు. ఇటీవలి కాలంలో చింతలపల్లి గ్రామంలో ఒక క్రియా శీలకా సభ్యత్వం తీసుకున్న జనసైనికుడుకి ప్రమాదం జరిగి తీవ్ర గాయాలపాలయ్యాడు అతనికీ దైర్యం చెప్పి పార్టీ ఆదుకుంటుందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం జనసేన ప్రమాద భీమా పధకం ద్వారా అక్షరాల యాబై వేల రూపాయలు (50,000/-) బాదితుడికి చెక్ అందచేసే విధంగా ఆనంద రాజు కృషి ప్రశంసనీయమైనది.