RCB vs CSK: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ
ఐపీఎల్-13లో దుబాయ్ వేదికగా బెంగళూరు చెన్నైతో తలపడుతుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ దుబాయ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
టాస్ గెలిచిన బెంగళూరు సారథి కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇసురు ఉడానా స్థానంలో మొయిన్ అలీ తుది జట్టులోకి వచ్చాడు. శార్దుల్ ఠాకూర్, జోష్ హేజిల్వుడ్ స్థానంలో మిచెల్ సాంట్నర్, మోనూ కుమార్లను జట్టులోకి తీసుకున్నట్లు ధోనీ చెప్పాడు.
ఒత్తిడిలో ఉన్న చెన్నైపై గెలిచి టేబుల్ టాపర్గా నిలవాలని కోహ్లీసేన పట్టుదలతో ఉంది. లీగ్ దశలో ఆడాల్సిన మిగతా మ్యాచ్ల్లో కుర్రాళ్లకు అవకాశాలివ్వాలని ధోనీ భావిస్తున్నాడు. ఆడిన 10 మ్యాచ్ల్లో ఏడు విజయాలతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. చెన్నై ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడగా కేవలం మూడింటిలో మాత్రమే గెలుపొంది పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.