పొత్తుధర్మంలో భాగంగా కూటమిని గెలిపించాలని కోరిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు, పొత్తుధర్మంలో భాగంగా ఏలూరులో కూటమి అభ్యర్థిని గెలిపించాలని రెడ్డి అప్పల నాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి స్పష్టమైన హామీ రావడంతో సోమవారం ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, జనసైనికులతో రెడ్డి అప్పల నాయుడు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యచరణ పై పొత్తు ధర్మం పాటిస్తూ తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఆంధ్రరాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న ఈ రాక్షస పాలనను అంతమొందించాలని పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని, కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రెడ్డి అప్పలనాయుడు కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.