ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య అతిథిగా రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం స్థానిక 15వ డివిజన్ పరిధిలోని ఆముదాల అప్పలస్వామి కాలనీలో నూతన అభయాంజనేయ స్వామి, కుమార స్వామి, మూషికం, బలిపీఠం సమేత శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ప్రతిష్ట మహోత్సవానికి ఆలయ నిర్మాణ కమిటీ వారి ఆహ్వానం మేరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రెసిడెంట్ యలగా సత్యనారాయణ (అన్నవరం), సెక్రటరీ నక్కా బాబూజీ, జనసేన నాయకులు పైడి లక్ష్మణరావు, ఈపిజర్ల కాశీ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.