ముఖ్యమంత్రి పై ధ్వజమెత్తిన రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో రైతు భరోసా యాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఖండిస్తూ పవన్ కళ్యాణ్ ని పదేపదే దత్తపుత్రుడిని ప్రస్తావిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సి.బి.ఐ దత్తపుత్రుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తమ వైఖరి మార్చుకోవాలని లేకుంటే రానున్న రోజుల్లో ప్రజలు మీకు కచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా ఉంటుందని రెడ్డి అప్పలనాయుడు హెచ్చరించారు. ప్రజల తరఫున ప్రజల కోసం నడిపే పార్టీ ఏదన్నా ఉన్నదంటే అది ఒక జనసేన పార్టీ అని గుర్తు చేశారు. రాష్ట్ర రైతుల బాగోగుల కోసం తన కష్టార్జితాన్ని కౌలు రైతులకు అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కళ్లు మూసుకుని ఉంటుంది తప్ప రైతులను ఆదుకోవాలని ఆలోచనలేకుండా పరిపాలన చేస్తుందని జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పల నాయుడు ధ్వజమెత్తారు. ఒక పక్కరాష్ట్రంలో తుఫాను దెబ్బకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించకుండా ప్రజల తరఫున మాట్లాడే పవన్ కళ్యాణ్ మీద అసత్యపు ఆరోపణలు చేస్తారా. మీ అసత్యపు మాటలు నమ్మే వారు ఎవరూ లేరని సూచించారు. అలాగే ప్రజాసమస్యల మీద స్పందించకుండా ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ మీద పడి అబద్ధపు ప్రచారం చేసి ప్రజలను మోసం చేస్తున్నారు అని జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు మండిపడ్డారు.