నాదెండ్ల మనోహర్ తో యువశక్తి పోస్టర్ ఆవిష్కరించిన రేగిడి లక్ష్మణరావు

శ్రీకాకుళం జిల్లా, ఆదివారం రణస్థలంలో యువశక్తి సభ ప్రాంగణం నందు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని రేగిడి లక్ష్మణరావు మర్యాదపూర్వకంగా కలివడం జరిగింది. ఈ సందర్భంగా నాదెండ్ల, రేగిడి లక్ష్మణరావును చీపురుపల్లి నియోజకవర్గం నుండి యువశక్తి ప్రోగ్రాంకి చేస్తున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా యువశక్తి పోస్టర్ రిలీజ్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండల అధ్యక్షులు విసినిగిరి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి దంతులూరి రామచంద్రరాజు, బంటుపల్లి గవర్నమెంట్ గుడివాడ ఉమామహేశ్వరరావు, భవాని శంకర్, జిల్లా నాయకులు, జనసైనికులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.