NHPC లో ట్రెయినీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

నేషనల్ హైడ్రోఎలక్ట్రానిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 86 పోస్టులను భర్తీ చేయనుంది. గేట్‌-2020, యూజీసీ నెట్‌, క్లాట్ (పీజీ), సీఏ లేదా సీఎంఏలో సాధించిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేయనుంది.

పోస్టు పేరు: ట్రెయినీ ఇంజినీర్‌

మొత్తం పోస్టులు: 86

సివిల్‌-30

ఫైనాన్స్‌-22

మెకానికల్‌-21

లా-8

హెచ్ఆర్‌-5

అర్హత: 60 శాతం మార్కలతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి ఉండాలి. మిగిలిన పోస్టులకు హూమన్ రిసోర్స్ స్పెషలైజేషన్‌తో పీజీ లేదా పీజీ డిప్లొమా లేదా ఎంబీఏ చేసి ఉండాలి, అదేవిధంగా మూడు లేదా ఐదేండ్ల లా, సీఏ లేదా సీఎంఏ పూర్తిచేసి ఉండాలి. 2020, అక్టోబర్ 1 నాటికి 30 ఏండ్ల లోపువారై ఉండాలి.

ఎంపిక విధానం: గేట్‌-2020, యూజీసీ నెట్‌, క్లాట్ (పీజీ), సీఏ లేదా సీఎంఏలో సాధించిన స్కోర్ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 29

దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 28

వెబ్‌సైట్‌: www.nhpcindia.com