మార్కాపురం నియోజకవర్గంలో వైసిపి ఫ్లెక్సీలను తొలగించాలి: జనసేన డిమాండ్

  • పార్టీ శ్రేణులు సమయనం పాటించాలి
  • ఒకటికి పది యాంటీ ఫ్లెక్సీలు వేస్తాము
  • మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాధ్

మార్కాపురం నియోజకవర్గం: పేదలకి – పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం అనే పేరుతో వైసిపి నాయకులు అత్యంత ఆటవికంగా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పల్లకి మోస్తున్నట్లు ఫ్లెక్సీలో చిత్రీకరించి వైసీపీ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ చర్యతో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మనోభావాలు దెబ్బతింటున్నాయనే ఉద్దేశంతో అందుకు ప్రతి చర్యగా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ ఆదేశాల మేరకు మార్కాపురం నియోజకవర్గంలో ఎక్కడ కూడా బ్యానర్స్ లేకుండా చేయాలని మార్కాపురం సిఐ, పొదిలి సిఐ, మార్కాపురం మున్సిపల్ కమిషనర్ మరియు పొదిలి మున్సిపల్ కమిషనర్ లకు మెమొరండం అందజేయడం జరిగింది. విషయంపై మార్కాపురం సిఐ భీమా నాయక్ స్పందించి వారి పరిధిలో కట్టిన ఫ్లెక్సీలు, వాటి మీద చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇమ్మడి కాశీనాధ్ తెలియజేస్తూ పార్టీ శ్రేణులకు సమయనం పాటించాలని తాను ఆదేశించేంతవరకు ఓపికగా వేచి ఉండాలని మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇటువంటి పరిణామాలని చూస్తూ ఊరుకోదని, తాను వ్యక్తి గతంగా అధికారులతో మాట్లాడానని రేపటి వరకు వేచి ఉండాలని, ఒక వేళ అధికారులు స్పందించకుండా ఉంటే మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ చూస్తూ ఉపేక్షించదని, ఒకటికి పది యాంటీ ఫ్లెక్సీలు వేస్తామని తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులు పైశాచిక ఆనందాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని చక్కదిద్దాల్సిన ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ.. రాష్ట్ర మంతటా అల్లర్లను ప్రోత్సహిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.