రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రతిపాదించాలని వినతి

*కలెక్టర్ విజయరామరాజుకు వినతిపత్రం అందజేస్తున్న జనసేన నాయకులు

రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయాలని రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతూ, శుక్రవారం జనసేన నాయకులు కలెక్టర్ విజయరామరాజు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, రాజంపేటను జిల్లా కేంద్రంగా చేసేందుకు అన్ని వసతులు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వానికి వినతిపత్రంలో తెలియజేశారు. రెండు నియోజక వర్గాల ప్రజలును దృష్టిలో పెట్టుకొని రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.