విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతుగా జనసేన నాయకులు

నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గ పరిధిలోని కోవూరు మండలం గుమ్మళ్ళదిబ్బ గ్రామంలో 50 ఏళ్ల నుంచి పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు 420 మంది విద్యార్థులు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఇప్పుడు అధికారులు ఈ పాఠశాలని మూసివేస్తాము అని విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాలలోని విద్యార్థులను వేరే పాఠశాలకు బధిలిచేస్తాము అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తూ.. మా పాఠశాల మాకు కావాలి అని నిరసనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులకు మద్దతుగా జనసేన పార్టీ తరుపున ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ నాయకులు చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు సుధీర్, మండల అధ్యక్షుడు అల్తాఫ్, ఉపాధ్యక్షుడు, నరాలశెట్టి మహేష్, సాయి, పలువురు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.