మార్కాపురం జిల్లా సాధనకై “25”వ రోజు రిలే నిరాహార దీక్ష

మార్కాపురం ఆర్.డి.ఓ కార్యాలయం వద్ద మార్కాపురం జిల్లా సాధన సమితి (జేఏసి) ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణ న్యాయవాదుల సంఘం వారు చేపట్టిన నిరాహార దీక్షకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేసిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ చార్జ్ మరియు జిల్లా సాధన సమితి వైస్ చైర్మెన్ ఇమ్మడి కాశీనాధ్, జేఏసి చైర్మెన్ నారాయణరెడ్డి, జేఏసి ట్రెజరర్ వక్కలగడ్డ మల్లికార్జున, జేఏసి కన్వీనర్ షేక్ సైదా, సిపిఐ నాయకులు అందే నాసరయ్య, కాసిం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సుదర్శన్, సిపిఎం నాయకులు రఫీ. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, పిన్నెబోయిన శ్రీను, గొట్టం శ్రీనివాసరెడ్డి, ఖాన్, శిరిగిరి శ్రీను, జిల్లా సాధన సభ్యులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.