నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉదృతి

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు వరద  ఉదృతి కొనసాగుతోంది. కృష్ణా నది ఎగువ ప్రాంతంతో పాటు జలాశయం పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ఎనిమిది క్రస్ట్‌ గేట్లను పది ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్‌కు 1,55,291 క్యూసెక్కుల ప్రవహం వస్తుండగా.. అదే మొత్తాన్ని దిగువకు విడుదల చేశారు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 309.6546 టీఎంసీల నిల్వ ఉంది.