జాతీయ సేవా రత్న పురస్కారం అందుకున్న గుడివాడ పట్టణ ఆర్.కె వారియర్స్

కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో మానవసేవయే మాధవసేవ అనే నినాదంతో సమాజ సేవ చేస్తున్న ఆర్.కె వారియర్స్ కి అఖిలభారత ఎన్జీవో ఎస్ సంక్షేమ సంఘం ఆదివారం గుంటూరులో జాతీయ సేవా రత్న పురస్కారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ సమాజమే దేవాలయంగా భావిస్తూ దేశానికి సమాజానికి పనిచేయడమే మా ఆర్కే వారియర్స్ లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఈ అవార్డులు రావడానికి కారణం మా స్పూర్తి ప్రదాత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని అలాంటి నాయకులకి మేము కార్యకర్తలుగా పని చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామని మాకు సహకరిస్తున్న గుడివాడ పట్టణ ప్రజలకు, మరియు మీడియా వారికి, ప్రభుత్వ అధికారులకు, మా హృదయపూర్వక ధన్యవాదములు అని తెలియజేశారు. అదేవిధంగా మా సేవలను గుర్తించి మాకు సేవారత్న పురస్కారం అవార్డు అందించిన అఖిలభారత ఎన్జీవో ఎస్ సంక్షేమ సంఘం వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలియజేయడం జరిగింది.