మెగా హీరో సాయితేజ్ కు రోడ్డు ప్రమాదం.. వెంటిలేటర్ పై చికిత్స.. నిలకడగా ఆరోగ్య పరిస్థితి

మెగా, హీరో సాయితేజ్ గత రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాదులో సాయితేజ్ స్పోర్ట్స్ బైక్ పై వెళుతుండగా ఐకియా జంక్షన్ వద్ద కిందపడ్డారు. గచ్చిబౌలి నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో సాయితేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. సాయిధరమ్ తల, ఛాతి, ఇతర భాగాల్లో తీవ్రమైన గాయాలు లేవని స్పష్టం చేశారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని వివరించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న జనసేన అధినేత, నటుడు పవన్‌కల్యాణ్‌, సినీ దర్శకుడు త్రివిక్రమ్‌, అల్లు అరవింద్‌, సందీప్‌ కిషన్‌ తదితరులు ఆసుపత్రికి తరలివచ్చారు. వైద్యులతో మాట్లాడిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.