జనసేన పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుకు మరమ్మత్తులు

హిందూపురం మునిసిపాలిటీ, 1వ వార్డు లోని కొట్నూరులోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని ఒక విధిలో కొన్ని కుటుంబాలు సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బంది పడుతుంటే విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, జిల్లా సంయుక్త కార్యదర్శి కొల్లకుంట శేఖర్, హిందూపురం మండల అధ్యక్షుడు చక్రవర్తి, కొట్నూరు రామంజి లు సొంత ఖర్చుతో మట్టి రోడ్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మరమ్మత్తు కార్యక్రమంలో జనసేన యూత్ పవన్ కుమార్, చిరంజీవి, మారుతీ, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.