అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకి అండగా నిలిచిన రుద్రవరం జనసేన

సత్తెనపల్లి నియోజకవర్గం, ముప్పాళ్ళ మండలం, కొద్దిరోజుల క్రితం ముప్పాళ్ళ మండలంలోని రుద్రవరం గ్రామంలో అనుకొని సంఘటన వలన మూడు పూరిళ్ళు కాలిపోవడం జరిగినది. ఈ సంఘటనలో ఒక బీసీ కుటుంబం, అలాగే ఒక ముస్లిం కుటుంబం ఇల్లు కాలిపోవడం జరిగినది. ఈ సంఘటన తెలిసి జనసేన పార్టీ నుండి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు ఆర్థిక సహాయం చేయడం జరిగినది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో రుద్రవరం గ్రామ జనసైనికులు తమ వంతుగా అందరూ కలిసి 20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆ బాధిత కుటుంబాలకు అందజేయడం జరిగినది.