వరద బాధితులకు సంపూర్ణేశ్ బాబు తన వంతు విరాళం

భాగ్యనగరంలో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం అగ్రహీరోలంతా తమ వంతు బాధ్యతగా సహాయాన్ని ప్రకటించగా ప్రముఖ నటుడు సంపూర్ణేశ్​ బాబు తన వంతు సహాయంగా రూ. 50 వేలను సీఎం సహాయనిధికి అందజేశారు.

హైదరాబాద్​లోని మంత్రి హరీశ్​రావు నివాసంలో స్వయంగా రూ. 50 వేల చెక్​ అందజేశారు సంపూ. సంపూర్ణేశ్​ బాబు చేసిన సహాయం పట్ల మంత్రి హరీశ్​రావు హర్షం వ్యక్తం చేశారు. దర్శకుడు ఎన్​. శంకర్​ కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. పది లక్షలు విరాళంగా ప్రకటించారు.