ప్రమాదవశాత్తూ దెబ్బలు తగిలిన వ్యక్తి కుటుంబానికి అండగా సంగం మండల జనసేన

సంగం మండలం జనసేన సీనియర్ నాయకుడు కూనపల్లి హరి ఆధ్వర్యంలో ఒక కుటుంబానికి నెల రోజుల నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరిగింది. దువ్వూరు గ్రామంలో తూర్పు హరిజన వాడకు చెందిన యోబు ప్రమాదవశాత్తూ సెంట్రింగ్ పనిలొ ఇనుపరాడ్ కరెంట్ తీగలు మీద పడి చేతులు దెబ్బతగిలాయి. అతనికి ముగ్గురు పిల్లలు. ఇల్లు జరగడం కష్టం అవుతుంది. వాలంటీర్లు అతనికి పింఛను రాయకుండా ఆలస్యం చేయడం జరిగింది. దీనితో సంగం మండలం జనసేన సీనియర్ నాయకులు కూనపల్లి శ్రీ హరి వారితో వాదన పడి అతనికి (యోబు) పింఛను వచ్చేలా కృషి చేశారు. ఇప్పుడు అతనికి పింఛను వస్తుంది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కూనపల్లి శ్రీహరి, దాడి బాను కిరణ్, ఆకులేటి సాయి చంద్, పెళ్లి మల్లి, రామిశెట్టి యస్వంత్, డి నరేష్ పాల్గొన్నారు.