సంతమాగులూరు ప్రమాదం బాధాకరం
గుంటూరు – కర్నూలు ప్రధాన రహదారిపై సంతమాగులూరు దగ్గర చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో అయిదుగురు మృత్యువాతపడ్డారని తెలిసి బాధపడ్డానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారని తెలిసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ప్రభుత్వం ఈ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని జనసేనాని కోరారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/janasenni1-1024x576.jpg)