సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మెకు జనసేన మద్దతు

విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులు, ఉద్యోగాలు రెగ్యులర్ చెయ్యాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ముమ్మిడివరం ఎయిమ్స్ కాలేజ్ దగ్గర సమ్మె మొదలుపెట్టారు. అది తెలుసుకున్న జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ వారి సమస్యలను తెలుసుకుని వారికి సంఘీభావం ప్రకటించారు. మా జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని విధాలా ఆదుకుంటాం అని హామీయిచ్చారు. సర్వ శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ వారి సమస్యలను బాలకృష్ణకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వీరివెంట గోదాశి పుండరీస్, కడలి కొండ, పుణ్యవతుల సూరిబాబు, దూడల స్వామి, గుద్దటి విజయ్, గాలిదేవర బుల్లి, కుంచనపల్లి ఆదిబాబు, పితాని రాజు, పెన్నాడ శివ, బొంతు వీరబాబు, వంగా సీతారాం, బీమాల సూర్య, చిట్టూరి దొరబాబు, తాడాల ఈశ్వరరావు, వనచర్ల బాలకృష్ణ, విత్తనాల రవి మొదలగువారు పాల్గొన్నారు.