జనసేన నాయకులను కలిసి ధన్యవాదములు తెలిపిన సత్యసాయి వర్కర్స్‌

పోలవరం నియోజకవర్గం సంవత్సరంన్నర నుండి ఆగిపోయిన సత్యసాయి ఉచిత గోదావరి మంచినీటి పథకం తిరిగి పునఃప్రారంభం అయ్యినందున సంవత్సర కాలంగా ఎన్నో పోరాటాలు చేసి ఇలా ప్రారంభానికి ప్రధాన కారణమైన జనసేనపార్టీ పోలవరం నియోజకవర్గం ఇంచార్జ్‌ చిర్రి బాలరాజు మరియు పశ్చిమగోదావరి జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కరాటం సాయిలను కలసి ధన్యవాదములు తెలిపిన సత్యసాయి వర్కర్స్‌. ఈ సంస్థ నుండి ఐదు నుండి ఆరు లక్షల మందికి నాలుగు నియోజకవర్గాలలో 250 గ్రామాలకు పైగా ఉచితంగా స్వచ్చమైన గోదావరి మంచినీరు అందనుంది.