జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవ్ ధర్మవరం

ధర్మవరం: సేవ్ ధర్మవరం కార్యక్రమాన్ని ధర్మవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, వై ఎస్సార్ కాలనీ తదితర కాలనీలలో నిర్వహిస్తూ జనసేన-తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చేనేతలను, చిరు వ్యాపారులను, మైనారిటీ సోదరులను ఆదుకుని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తామని కాలనీ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం కాలనీ ప్రజలు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్సలు బాగోలేదని వాపోయారు. తప్పకుండా జనసేన టిడిపి పార్టీ అధికారంలోకి రాగానే వారి యొక్క సమస్యలన్నీ తీరుస్తానని వారికి హామీ ఇచ్చి ధర్మవరంలో రౌడీ రాజ్యాన్ని పోగొట్టి ఈ వైసీపీ పాలనను అంతమోందించేందుకు ధర్మవరం ప్రజలంతా సహకరించి రాబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీనీ గెలిపించాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సుగుణ, ఆంజనేయులు, రామచంద్ర, శ్రీరాములు, మరియు జనసేన పార్టీ నాయకులు మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, ధర్మవరం రూరల్ మండల కన్వీనర్ డి. నాగ సుధాకర్ రెడ్డి, పట్టణ నాయకులు అడ్డగిరి శ్యామ్, కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు గొట్లురు జీవి, ప్యాదింది వెంకటేష్, రాజ్ ప్రకాష్, చిలకల సుధాకర్, కుమార్ స్వామి, ఆది, వన్ను శ్రీరాములు, మిరియాల లక్ష్మీనారాయణ, కోలా నాగార్జున, టి.ప్రతాప్, బాలకృష్ణ, ధారా గంగాధర్, గొంగటి హరి, బాషా, చిలకం సుధాకర్ రెడ్డి, సంకు అఖిల్ రాయల్, జనసేన పార్టీ వీరమహిళ గొట్లురు శైలజ, మరియు సాకే నరసింహులు, కే.రాజేష్, మిరపగారి శంకర, పుల్లంపల్లి రమేష్, అన్వర్, జయరాం రెడ్డి, నత్తి శ్రీరామ్ రెడ్డి, అది, బిల్లే నందా తదితరులు పాల్గొన్నారు.