రెండవ విడత “మన సీతానగరం – మన జనసేన”
పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం మండలంలో గల దయానిధిపురం గ్రామంలో మన సీతానగరం – మన జనసేన కార్యక్రమంలో భాగంగా పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గ నాయకులు అక్కివరపు మోహన్ రావు పాల్గొని జనసేన పార్టీ సిద్ధాంతాలు గురించి మరియు వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరించడం జరిగింది. ప్రజల నుండి సానుకూల స్పందన వచ్చిందని, రాబోయే రోజుల్లో జనసేనకి మద్దతిస్తామని ప్రజలు చెప్పటం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నియోజక వర్గ నాయకులు గంటేడ స్వామీ నాయుడు, హరిచరణ్ శంబాన, జై శంకర్, ప్రకాశ్, ప్రగఢ కళ్యాణ్, పాలూరు వెంకటేష్, దామోదర్, అల్లు రమేష్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-30-at-12.41.05-1024x461.jpeg)