వైసీపి సీనియర్ నేత జనసేనలో చేరిక

  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బత్తుల

రాజానగరం, సీతానగరం మండలం, కాటవరం గ్రామంలో ఉన్నతమైన రాజకీయ నేపథ్యం ఉన్న సీనియర్ నాయకులు “కాట్రగడ్డ రామారావు చౌదరి” (అబ్బులు చౌదరి) ఈ అసమర్ధ వైసీపీ పాలన పట్ల విసుగు చెంది “పవన్ కళ్యాణ్” ఆశయాలు, రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు “బత్తుల బలరామకృష్ణ” సమర్థమైన నాయకత్వం పట్ల ఆకర్షితులై శుక్రవారం జనసేన పార్టీలో ప్రముఖ నేతల మదయ్న జాయిన్ అవ్వడం జరిగింది. వారికి రాజానగరం జనసేన నాయకులు బలరామకృష్ణ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. త్వరలో ఒక సభ ద్వారా వారి అనుచరగణం మొత్తం(వైసీపీ కార్యకర్తలు) జనసేన పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మట్టా వెంకటేశ్వరరావు, మద్దాల యేసుపాదం, చీకట్ల వీర్రాజు, బండి సత్యప్రసాద్, కొండేటి సత్యనారాయణ, నాయుడు, దాసరి రమేష్, సూరిబాబు, వేగిశెట్టి రాజు, బోయిడి వెంకటేష్, సేనాపతి మహేష్, ఇతర నేతలు పాల్గొన్నారు.