శేరిలింగంపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

శేరిలింగంపల్లి, జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ మాధవరెడ్డి జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు, గత వారం రోజులుగా ఉచిత మెడికల్ క్యాంప్,రక్త దాన శిభిరం, ఉచిత కంటి వైద్య శిభిరం, అన్నదానం, మొక్కల పంపిణీ కార్యక్రమం వివిధ సేవా కార్యక్రమాలు నియోజకవర్గ డివిజన్ కో-ఆర్దినేటర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజల తరపున ప్రాతినిధ్యం వహిస్తూ అనేక అంశాల పట్ల అంకితభావంతో పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అని రాబోయే తరాల భవిష్యత్తు కోసం, భారతావని అభివృద్ధి కోసం నిస్వార్ధంగా పని చేసే ఏకైక పార్టీ జనసేన అని, అధినేత పవన్ కళ్యాణ్ వెంటే నడుస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజన్ కో-ఆర్డినేటర్లు వీర మహిళలు, జనసైనికులు పాల్గొని విజయవంతం చేయటం జరిగింది.