గుడుపల్లిలో జనసేన క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ

చిత్తూరు జిల్లా, కుప్పం, ఆదివారం ఉదయం 11 గంటలకు అధిష్టానం ఆదేశాల మేరకు జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.హరిప్రసాద్ మరియు కుప్పం నియోజకవర్గ ఇంచార్జి డా.వెంకటరమణ పర్యవేక్షణలో జిల్లా కార్యదర్శి కె.రామమూర్తి, జిల్లా సంయుక్త కార్యదర్శులు వేణు మునెప్ప ల ఆధ్వర్యంలో గుడుపల్లి మండల అధ్యక్షులు అమీర్ అధ్యక్షతన గుడుపల్లి మండల కేంద్రంలోని పార్టీ ఆఫీస్ నందు క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్లకు సన్మానం మరియు కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులైన మృత్శకార విభాగ రాష్ట్ర కార్యదర్శి వామనమూర్తి, నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు నవీన్, గుడుపల్లి మండల కమిటీ గణేష్, భాస్కర్, హంసగిరి జాన్, జి మురుగేశ్, రామచంద్ర, జాకీర్, హిమాద్, రాజేష్, శేఖర్, ప్రదీప్, మంజునాథ్, కుమరేశ్, సూర్యప్రకాష్, మరియు అరుణ్, అరవింద్ హాజరయ్యారు.