Pithapuram: ప్రమాదానికి గురైన జనసైనికులకు మనోధైర్యాన్నిచ్చిన శేషుకుమారి

పిఠాపురం మండలం గోకివాడ గ్రామంలో ఆదివారం రాత్రి జనసైనికులు గల సాయి కృష్ణ, దాసం రాజాలకు బైక్ యాక్సిడెంట్ అవ్వటంతో గాయాలు తగిలాయని పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి గకి జనసైనికులు చెప్పడంతో సోమవారం గోకివాడలో వారి నివాసానికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు జన సైనికులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం రూరల్ అధ్యక్షురాలు తోలేటి శిరీష, గౌరవ అధ్యక్షులు సలాధి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి అడపా శివరామకృష్ణ, గరగ కొండలరావు, విశ్వనాథన్ బాబ్జి, గొల్లపల్లి వీర గణేష్, కాయల పవన్ కుమార్, కొనమంచిలి అప్పారావు, పెంటకోట కృష్ణ, నామ సూర్య చంద్ర, గాడిశెట్టి స్వామి, దాసం సత్తిబాబు, గొల్లపల్లి వెంకట రావు, విరవాడ ఎంపిటిసి అభ్యర్థి రామిశెట్టి సూరిబాబు, పిఠాపురం కార్యవర్గ సభ్యులు గంజి గోవిందరాజులు, ఓలేటి సాయిరెడ్డి, కొండపల్లి శివ, కంద సోమరాజు, మరియు గోకివాడ జనసైనికులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.