బొలిశెట్టి జన్మదినోత్సవ వారోత్సవాలలో భాగంగా సేవా కార్యక్రమలు

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: తాడేపల్లిగూడెం జనసేన ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదినోత్సవ వారోత్సవాలలో భాగంగా తాడేపల్లిగూడెంలో జనసేన ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వారోత్సవాలలో 4వ రోజు సేవా కార్యక్రమాలలో భాగంగా అదివారం జనసేన పార్టీ వీర మహిళ పెంటపాడు మండల అధ్యక్షురాలు పెనుబోతుల సోమలమ్మ ఆధ్వర్యంలో జట్లపాలెం గ్రామంలో శ్రీ పారుపల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు ముగించుకొని అక్కడున్న వృద్ధులకు ఫ్రూట్స్ దుప్పట్లు శ్రీనివాస్ తనయుడు బొలిశెట్టి రాజేష్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం జనసేన పార్టీ లైజనింగ్ కమిటీ సభ్యులు లింగం శ్రీను ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం 1వ వార్డు క్రిస్టియన్ వలీవా చర్చి నందు కేక్ కటింగ్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడ పేదలకు ఆడబాల మురళి, గోగు కిరణ్, అచ్చిబాబు ఆధ్వర్యంలో మూడు ఫ్యామిలీలకు నెలకు సరిపడ సరుకులు రాజేష్ చేతులు మీదగా అందజేశారు. అనంతరం తాడేపల్లిగూడెం టూ టౌన్ తణుకు బస్టాండ్ దగ్గర 500 మందికి లింగం శ్రీను ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమలలో అడబాలనారాయణమూర్తి, రామ్ శెట్టి సురేష్, వర్తనపల్లి కాశి, పుల్ల బాబి, అడప ప్రసాదు కేశవబట్ల విజయ్, మద్దాల మణికుమార్, సజ్జ సుబ్బు, మట్టా రామకృష్ణ, పాలూరి బూరయ్య, కాజులూరి మల్లేష్, నీలపాల దినేష్, మద్దాల నరసింహ, యాంత్రపాటి రాజు, పెనుబోతుల బాలాజీ మాదాసు ఇందు, రౌతు సోమరాజు, చేపల రమేష్, స్వామి నాయుడు, బయనపాలేపు ముఖేష్, సోమశంకర్, పిడుగు రామ్మోహన్, జట్లపాలెం శీను, మలపాక చిట్టి, మర్రిపూడి చిన్న, రత్నకుమారి, మధుమతి, లక్ష్మీప్రసన్న, విజయ, తులసి, కళ్యాణి, ప్రభా శ్రీ, రాజేశ్వరి, గాయత్రి, విజయ మరియు జనసేన నాయకులు వీరమహిళలు జనసైనికులు పాల్గొన్నారు.