హనుమాన్ ఆలయంలో ప్రచార రథాలకు పూజలు నిర్వహించిన శంకర్ గౌడ్

తెలంగాణ, తాండూరు రైల్వేస్టేషన్ హనుమాన్ ఆలయంలో జనసేన పార్టీ ప్రచార రధాలకు తెలంగాణ జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు తాండూరు నియోజకవర్గ బీజేపి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్ధి శంకర్ గౌడ్ పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.