మైనారిటీలకు ఏ హామీ నెరవేర్చారని ప్రశ్నించిన షేక్ మహబూబ్ మస్తాన్

వైసిపిలో ఉండే ముస్లిం మైనార్టీ ఎమ్మెల్యేలను సూటిగా ప్రశ్నించిన అనంత సాగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ అంజద్ బాషా, హఫీజ్ ఖాన్, ఇక్బాల్ అహ్మద్, మహమ్మద్ ముస్తఫా మాట్లాడితే 95 శాతం హామీలు జగన రెడ్డి నెరవేర్చాడు అంటున్నారు. అంధ్ర ప్రదెష్ మైనారిటి ఎమ్మెల్యేలుగా పదవులు అనుభవిస్తున్న మీరే చెప్పండి. దుల్హన్ పధకం, విదేశీ విద్య, ఏ.పి.ఎస్.ఎం.ఎఫ్.సి సబ్సిడీ రుణాలు, హజ్ యాత్రకు ఆర్థిక సాయం, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, ఇమామ్ మౌజన్ లకు గౌరవ వేతనం, ఇమామ్ మౌజన్ లకు ఇళ్ల స్థలాలు ఇస్లామిక్ బ్యాంక్, మస్జీద్ ల మరమ్మతుల కోసం ఆర్థికసాయం, మైనారిటీ మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాలు, వీటిలో ఏ హామీ నెరవేర్చారొ ఎప్పుడు నెరవేర్చారొ తెలియచేయాలి లేదా తక్షణమే మీ పదవులకు రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీల అందరి తరపున జనసేన పార్టీ తరపున తెలియచేస్తున్నానని అన్నారు.