పొన్నలూరు ఐటి అధ్యక్షులను అభినందించిన షేక్ రియాజ్

కొండపి: సోమవారం ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు షేక్ రియాజ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం ఐటి విభాగం అధ్యక్షులు పిల్లిపోగు పీటర్ బాబు మరియు పెయ్యల రవి. అదేవిధంగా పొన్నలూరు మండలం అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ కూడా పాల్గొన్నారు. పొన్నలూరు మండలంలో జనసేన పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతూ, సోషల్ మీడియాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, వెన్నుదన్నుగా ఉంటున్న ఐటి విభాగం నాయకులను ప్రత్యేకంగా అభినందించిన షేక్ రియాజ్, పొన్నలూరు మండల కమిటీ సభ్యులు విద్యావంతులు, చైతన్యవంతులు, మేధావులు, ఆదర్శభావాలు, సేవాగుణం కలవారు అని షేక్ రియాజ్ తెలియజేశారు. దాదాపు 50 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులను జనసేన పార్టీలో ఇప్పటివరకు భాగస్వాములను చేయడం జరిగింది అని పిల్లిపోగు పీటర్ బాబు తెలియజేశారు. నా చివరి శ్వాస వరకు జనసేన పార్టీ కోసం కష్టపడతాను అని పెయ్యల రవి తెలియజేశారు. మండలంలో జనసేన పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గురించి చర్చించడం జరిగింది. 2024 లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ, అహర్నిశలు పార్టీ అభివృద్ధి దిశగా నా ప్రయాణం కొనసాగిస్తాను అంటూ కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు.