మండల అధ్యక్షులను అభినందించిన షేక్ రియాజ్

కొండపి నియోజకవర్గం: సింగరాయకొండ మండలం, జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో కొండపి నియోజకవర్గం ఆరు మండలాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించడం జరిగింది. కొండపి నియోజకవర్గంలో వైసిపి ప్రభుత్వంలో కొంతమంది అవినీతిపరుల ఆగడాలకు అడ్డుకట్ట వేసి, ప్రజలను నిజాయితీ వైపు నడిపిస్తున్న జనసేన మండల అధ్యక్షులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల రేసులో కొండపి కూడా పోటా పోటీగా అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి డి అంటే డి అనే విధంగా మండల అధ్యక్షులు సిద్ధమయ్యారు. ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ, వైసిపి అవినీతిని ఎండకడుతూ, వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రజల కోసం ప్రతినిత్యం పోరాటం చేస్తూ, జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తూ, విజయం వైపు ప్రయాణిస్తున్న ఆరు మండలాల అధ్యక్షులకు శుభాకాంక్షలు అంటూ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిట్టెం ప్రసాద్, మేడా రమేష్ నాయుడు, కనపర్తి మనోజ్ కుమార్, ఐయినాబత్తిని రాజేష్, గూడా శశిభూషణ్, కందుకూరి రాంబాబు, విశ్వం, చంద్రశేఖర్, మరియు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.