జనసేన పార్టీ ఆవిర్బావ సభకు పిలుపునిచ్చిన శెట్టిబత్తుల రాజబాబు

తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం నియోజకవర్గ జనసేనపార్టీ ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు అధ్యక్షతన వెండి, బంగారు వర్తక సంఘం కళ్యాణ మండపంలో సమావేశం జరిగింది. ఈనెల 14సోమవారం నాడు అమరావతిలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభ గురించి చర్చించారు. శెట్టిబత్తుల రాజబాబు మాట్లాడుతూ ఆవిర్బావ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు పిండి సాయిబాబా, కౌన్సిలర్ గండి దేవి హారిక, చిక్కంసుధ, చాట్ల మంగతాయారు, రాష్ట్ర కార్యదర్శి మహాదశ నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సందాడి శ్రీనుబాబు, చిక్కాల సతీష్, చిక్కం భీముడు, నాయకులు ఆకుల బుజ్జి, కూనవరం సర్పంచ్ వాకపల్లి ఈశ్వరీ సత్యనారాయణ, గోపాయులంక సర్పంచ్ చిట్నీడి శ్రీదేవి, శ్రీను, ఉప సర్పంచ్ కంకిపాటి వీరబాబు, మామిడిపల్లి దొరబాబు, ముత్యాల మణి, వీరమహిళలు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం జనసేన క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేయించిన వారిని సన్మానించారు.