వరద ముంపు ప్రాంతాలలో శెట్టిబత్తుల రాజబాబు సహాయక పర్యటన

కోనసీమ జిల్లా: కోనసీమ అల్లవరం మండలంలో వరద ముంపునకు గురైన అల్లవరం లోని బుడంపేట, బోడసకుర్రు గ్రామాలలొ జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు పర్యటించి వరద బాధితులకు ఆహార పంపిణీ చేశారు. గోడి తిప్పశివారు గోపాయి లంక రైతులకు గడ్డి పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి మహదశ నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సందాడి శ్రీనుబాబు, కార్యదర్శి చిక్కాల సతీష్, సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు, అల్లవరం మండల ఉప సర్పంచ్ కంకిపాటి వీరబాబు, కంకిపాటిసుబ్బన్న, మొయిలసోమరాజు, చిక్కం సూర్యమోహన్, గండి స్వామి, కుంపట్ల వెంకట రమేష్, ముత్తాబత్తుల శ్రీను, కంకిపాటి నాగన్న, చవల వెంకటేశ్వరరావు, చికిలే చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.