సాగు భూములకు నష్ట పరిహారం చెల్లించాలని హెచ్చరించిన శివదత్ బోడపాటి
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-22-at-7.57.23-PM-1024x768.jpeg)
పాయకరావుపేట నియోజకవర్గం రాజయ్యపేటలో 2013 వ భూసేకరణ ఆక్ట్ కింద రైతులకు ఎటువంటి నష్ట పరిహారం సాగు భూములకు, మొక్కలకు వెయ్యలేదు. పై వాటికి నష్టపరిహారం ఇవ్వలేదు. కాబట్టి ఏపీఐఐసీ వారు చేపడుతున్న పనులను శనివారం ఆపడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ ఈ కార్యక్రమంలో వారిని హెచ్చరించడం జరిగింది. నష్ట పరిహారం సాగు భూములకు పరిహారం చెల్లించిన తర్వాతే మీరు ఏ విధమైన పనులు ఐనా చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేపల రామకృష్ణ, రాంబాబు, కొప్పిచెట్టి వెంకటేష్, పీక్కి స్వామి, చందనడ గబ్బర్ సింగ్, సుబ్బు, తదితర జనసైనికులు పాల్గొన్నారు.