విశాఖ పశ్చిమ జనసేన ఆధ్వర్యంలో “ఆకలితో ఉన్న వారికి భోజనం”

విశాఖ పశ్చిమ నియోజకవర్గం, ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ స్పూర్తితో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయంకై పేద ప్రజల ఆకలి నింపే ప్రయత్నంగా “ఆకలితో ఉన్న వారికి భోజనం” అనే కార్యక్రమాన్ని ప్రతి శనివారంలాగే ఈ శనివారం కూడా పిజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోపాలపట్నం రైల్వే స్టేషన్ నందు జరిగిన కార్యక్రమం అలాగే శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి భక్తులకు అన్నదానం కార్యకార్యక్రమంలో విశాఖ పశ్చిమ జనసేన నాయకులు శ్రీ పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ మరియు జనసైనికులు ప్రకాష్, ప్రేమ్, చింటు మరియు ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.