శ్రామిక నగర్ పాక్షికంగా రోడ్ల నిర్మాణానికి కదిలొచ్చిన అధికారులు

నెల్లూరు : జనసేన తరపున గత నెలరోజులుగా శ్రామిక నగర్ లో రోడ్లు, డ్రైనేజీ, నీరు సరఫరా దుస్థితిని వివరిస్తూ పలుమార్లు జనసేన తరఫున ప్రశ్నించిన సంగతి విదితమే. ఈ సందర్భంగా కార్పొరేషన్ అధికారులు ఆ ప్రాంతం ను సందర్శించి మొత్తం ఎస్టిమేట్ చేస్తే దాదాపుగా 55 లక్షలు అవుతుంది. ప్రస్తుతానికి కార్పొరేషన్ లో నిధులు లేవు కాబట్టి ముఖ్యంగా అవసరమైన రోడ్లను గుర్తించి వాటి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.
▪️ స్థానికులతో మాట్లాడి స్కూలు వెనుక రోడ్డు అలాగే తమ గ్రామ దేవత పోలేరమ్మ వద్ద గల వీధులను ముందుగా వేయవలసిందిగా స్థానికులు కోరారు.
▪️ వీలైనంత త్వరగా ఈ రెండు రోడ్లను నిర్మిస్తామని స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
▪️ మౌలిక వసతుల లేమి తో ప్రాంత వాసులు నానా ఇబ్బందులకు గురి అవుతున్నారని అధికారులు త్వరగా స్పందించి ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సహయ సహకారాలు అందించాల్సిందిగా కోరారు.
▪️ శ్రామిక నగర్ లో మంచినీటి సరఫరా రెండు రోజులకు ఒకసారి ఒక గంట మాత్రమే వస్తుంది. కలుషితమైన మీరు వస్తుందని వాటిని నివారించాల్సిందిగా తెలిపారు.
▪️ వైయస్సార్ నగర్ లో నీటి ట్యాంకు ద్వారా సరఫరా చేసే నీరు కొన్ని ప్రాంతాలకు అందట్లేదని తగు చర్యలు తీసుకొని ఆయా ప్రాంతాలకు అందే విధంగా చేయాలని కోరారు.
▪️ అలాగే ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి పైపు లైన్ కనెక్షన్ ఇప్పించేందుకు మేము కూడా ప్రయత్నిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, స్థానిక నాయకులు శ్రీను, హేమచంద్ర యాదవ్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.