శ్రీ గణేష్ జూనియర్ కళాశాల ప్రభంజనం

విశాఖ, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం, డాబా గార్డెన్స్ లో నిర్వహించిన శ్రీ గణేష్ జూనియర్ కాలేజి విద్యార్థుల సక్సెస్ మీట్ లో జి.వి.ఎం.సి అడిషనల్ కమిషనర్ వై.శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని. పరీక్షల్లో 465 మార్కులు సాధించిన అమలాపురంకి చెందిన విద్యార్థి హైదర్ ను సత్కరించారు. ఈ సందర్భంగా వై.శ్రీనివాస్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు ఇష్టమైన చదువులు చదివించాలని, తల్లిదండ్రుల సహకారంతో పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటారని, పిల్లల ఇష్టప్రకారం తోడ్పాటు ఇవ్వాలి గాని పిల్లలపై ఎటువంటి వత్తిడి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. శ్రీ గణేష్ జూనియర్ కాలేజి ఛైర్మన్ బి.ఎల్.గణేష్ మాట్లాడుతూ సాధారణ విద్యార్ధిని ఉన్నత స్థాయికి చేరుకునేలా మేము కృషి చేస్తామని, మాది సమిష్టి విజయమని ఈ విజయంలో తోడ్పాటు అందించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, తోటి కాలేజి ఫ్యాకల్టీ మెంబెర్స్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మా విద్యార్థులను ఉన్నత స్థాయికి చేరుకునేలా తీర్చిదిద్దడమే మా సంస్థ కృషి చేస్తుందని తెలియచేసారు, మా విద్యార్థులు ఐఐటీలో స్ధానం సాధిస్తారని, అందుకు మేమందరం కలిసి కృషి చేస్తామని తెలియచేసారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మెమెంటోలతో సత్కరించారు. ఈ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని శ్రీ గణేష్ జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ కె.కృష్ణచైతన్య నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జనసేన నాయకులు కళాశాల యాజమాన్యాన్ని ప్రశంసించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ ఫ్యాకల్టీ సభ్యులు మరియు ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ సెక్రెటరీ బావిశెట్టి కిరణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ రాఘవ శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ కొండేటి భాస్కర్, సంస్థ ప్రతినిధులు పోలిశెట్టి సూర్య ప్రకాష్, కొమ్ముల భార్గవ్ వంశీ, ఇరోతి సతీష్ పాల్గొన్నారు.