ఎన్డీఏ సమావేశానికి హాజరుకానున్న శ్రీ పవన్ కళ్యాణ్

జులై 18న ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ సమావేశంలో పాల్గొనవలసినదిగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం అందింది. ఎన్డీఏలో భాగస్వాములైన రాజకీయ పక్షాల అగ్రనేతలు హాజరవుతున్న ఈ సమావేశంలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ , పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ జులై 17 సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారు. బీజేపీ అగ్రనాయకత్వం నుంచి కొద్ది రోజుల క్రిందటే పార్టీకి ఈ ఆహ్వానం అందింది.