ఎంపిడిఓ జమీవుల్లాని కలిసిన సింగరాయకొండ జనసేన

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, ఎంపీడీవో జమీవుల్లాని శనివారం నాడు సింగరాయకొండ మండల జనసేన పార్టీ నాయకులు కలవడం జరిగినది. సింగరాయకొండలో పలు సమస్యలపై ఎంపిడిఓతో చర్చ చేయడం జరిగినది. ముఖ్యంగా గుజ్జుల ఎల్లమందరెడ్డి కాలనీలో నీటి సమస్య గురించి, పెద్ద కనుమల్ల రోడ్డు లోనీ నిల్వ ఉన్న మురికి నీటీ సమస్య గురించి, అంతేగాక గతంలో జనసేన పార్టీ నుండి పలు సమస్యలపై ఇచ్చిన అర్జీలు గురించి ఎంపిడిఓకి వివరణ అడగగా, గుజ్జుల ఎల్లమందరెడ్డి కాలనీలో నీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని, పెద్ద కనుమల్ల రోడ్డులో నిల్వ ఉన్న మురికినీటి సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని, మీరు ఇచ్చిన అర్జీలు అన్ని కూడా పరిష్కరిస్తామని, సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ కి హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.