గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న సింగర్‌ మనో

దేశవ్యాప్తంగా అప్రతిహతంగా కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సెలబ్రెటీలు మొక్కలు నాటుతూ భాగస్వాములవుతున్నారు. ఈ క్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సినీ సంగీత దర్శకుడు కోఠి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను సింగర్ మనో స్వీకరించారు. ఈ సందర్భమగా ఆయన గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా మనో మాట్లాడుతూ..ఆయువు లేనిదే మనిషే లేడు – ఆయువును ఇచ్చేది పచ్చని మొక్క అని తెలిపారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మను అన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపిన సింగర్ మనో.. అనంతరం మరో ముగ్గురు సింగర్స్  చిత్ర , సుజాత , శ్వేతా మోహన్ లు కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.