సీతానగరం జనసేన ఆద్వర్యంలో నా సేన కోసం నావంతు

సీతానగరం మండల కేంద్రంలో పార్టీ అధిష్టానం సంస్థాగత బలోపేతం కోసం చేపట్టిన “నా సేన కోసం నావంతు ” కార్యక్రమాన్ని జనసేన నాయకులు చేపట్టారు….నాయకులు యుపి ఐ ద్వారా తమవంతు ఆర్థిక సహాకారం పంపించి … ఇదే మాదిరిగా జనసైనికులు కూడా పార్టీ ఆర్థిక పురోభివృద్ధి కి 10రూపాయలనుండి శక్తి వంచన మేర సహకారం అందించవలిసిందిగా పిలిపునిచ్చారు.. పార్టీ కోసం ఇచ్చే ప్రతి రూపాయి రైతులకు, చేతివృత్తులకు, కార్మికులకు ఉపయోగపడుతుంది అని వివరిస్తూ.. ఇలాంటి మంచి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు.. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల నాయకులు అల్లు రమేష్, జై శంకర్, ధనుంజయ్, కిషోర్, బుజ్జి పంతులు, వెంకటరమణ మరియు పార్వతీపురం మండల నాయకులు ఖాత విశ్వేస్వరరావు, గణేష్, మణికంఠ, పవన్ తదితరులు పాల్గొన్నారు.