పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు

సర్వేపల్లి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమంలో ప్రత్యేక పూజలు. వెంకయ్య స్వామి 40వ ఆరాధన ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు వెంకయ్య స్వామి ఆశ్రమం వద్ద బుధవారం రాత్రి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని 101 టెంకాయలు పగలగొట్టిన జనసేన నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వైసిపి రాక్షస పాలన నుండి రాష్ట్ర ప్రజలను కాపాడాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని, ప్రజలందరిపై స్వామి వారి ఆశీస్సులు ఉండాలని వెంకయ్య స్వామి సన్నిధిలో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు పోలంరెడ్డి ఇంద్రారెడ్డి, షేక్ రహీం, కాకి శివకుమార్, ఆస్తోటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.