ఆరికట్ల జనార్ధన్ నాయుడుకు చిరు సన్మానం
వినాయక చవితి సందర్భంగా మర్రిపాడు ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మర్రిపాడు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ఆరికట్ల జనార్ధన్ నాయుడు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన మండల నాయకులు మర్రిపాడు మండల టిడిపి కన్వీనర్ ఆరికట్ల జనార్ధన్ నాయుడు మరియు ఆయన ధర్మ పత్ని ఇరువురికి ఘనంగా శాలువా కప్పి సన్మానించడం జరిగింది. అదేవిధంగా విగ్రహ ఏర్పాటుకు సహకరించిన గోవర్ధన్ నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోజడపల్లి ఆంజనేయులు నిరంజన్ దండు అశోక్ సురేష్ వినయ్ బాబి జనసేన నాయకులు చిన్న తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-18-at-6.02.44-PM-1024x575.jpeg)