బైక్ యాత్ర చేస్తున్న జనసైనికుడు దీపక్ ను సత్కరించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: ప్రపంచంలో చాలామంది దేవుళ్ళు ఉంటారు…. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు “పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే దేవుడు” అనే ప్లకార్డు ప్రదర్శిస్తూ…. తెలంగాణకు చెందిన జనసైనికుడు వరంగల్ నుండి బయలుదేరి ఆంధ్రప్రదేశ్ అంతా బైక్ పై యాత్ర గా పర్యటిస్తూ… పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న జనసైనికుడు మునుగోళ్ల దీపక్ ను దివాన్ చెరువు హైవే వద్ద నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి కలిసి వారి ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షించి.. వారి ప్రయత్నానికి చిరు సత్కారం అందజేసి.. కొన్ని రకాల పళ్ళు, కొంత నగదు అందజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత యర్రంశెట్టి శ్రీనివాస్ , మద్దిరెడ్డి బాబులు, బొంగా స్టాలిన్, బోయిడి వెంకటేష్, అడ్డాల దొరబాబు, తోట అనిల్ వాసు ఇతరు జనసైనికులు పాల్గొన్నారు.