ప్రతి ఒక్కరిలో సామాజిక బాధ్యత పెరగాలి: బత్తుల
- కార్యకర్తలకు భద్రత నిచ్చే పార్టీ ఒక్క జనసేన మాత్రమే..
- నియోజకవర్గంలో సహజ వనరుల దోపిడి పూర్తయిన వెంటనే ఈ వైసీపీ వారు ప్రజల ఆస్తుల మీద పడతారు..
- జననీరాజనాలతో ముందుకు సాగిన మహాపాదయాత్ర 68వ రోజు..
రాజానగరం: జనం కోసం జనసేన.. మహాపాదయాత్ర 68వ రోజు కార్యక్రమం మండల కేంద్రమైన కోరుకొండ గ్రామంలో.. ఆలహర్ సింగర్ పేటలో జరిగింది.. కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి సింగర్ పేటలో విస్తృతంగా పర్యటిస్తూ.. ప్రతి ఒక్కరినీ జనసేన పార్టీకి ఓటు వేసి, పవన్ కళ్యాణ్ గారిని ఆదరించి, ఆశీర్వదించాలని కోరుతూ, నేటి రాజకీయ వ్యవస్థలో సామాజిక స్పృహ, బాధ్యత కలిగిన పార్టీ జనసేన పార్టీ మాత్రమే ప్రజాపాలన తీసుకు రాగలదని.. కార్యకర్తలకు ఏ కష్టం రాకూడదని కార్యకర్తల భద్రత కోసం ఇన్సూరెన్స్ చేస్తున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అని.. ఈ వైసీపీ అరాచక ప్రభుత్వం పొరబాటున మళ్లీ వస్తే ఇప్పటివరకు సహజ వనరుల దోపిడీ మాత్రమే జరుగుతుందని.. అవి దొరకనప్పుడు ప్రజల ఆస్తులు కూడా కబ్జాలు చేయడానికి వీళ్ళు ఏమాత్రం వెనకాడరని ప్రజలకు వివరిస్తూ… జనసేన పార్టీ ఆశయాలు, విధివిధానాలను ముద్రించిన కరపత్రాలను పంచుతూ… గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలని అభ్యర్థించడం జరిగింది.. కార్యక్రమంలో మహిళలు, పెద్దలు విశేష ఆదరణతో ముందుకు సాగిన ఈ మహాపాదయాత్రలో జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-03-at-10.06.07-PM-1024x484.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-03-at-10.06.09-PM-1024x484.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-03-at-10.06.11-PM-1024x484.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-03-at-10.06.10-PM-1024x484.jpeg)